తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు ఎవరూ చేయని పని చేసిన మహిళ... ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించింది!
- ఎవరెస్ట్ అధిరోహించిన తొలి ఆఫ్ఘన్ మహిళగా రివర్ అహ్మద్ రికార్డ్
- తాలిబన్ల దాడిలో చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్న వైనం
- సోదరుడి మరణం తర్వాత పర్వతారోహణ వైపు మళ్లిన రివర్
- ఆఫ్ఘన్ బాలికల విద్య, స్వేచ్ఛ కోసమే ఈ యాత్ర అని వెల్లడి
- యాత్ర కోసం సుమారు 85,000 డాలర్లు సొంతంగా సమకూర్చుకున్న వైనం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఒక సాహసం అయితే, ఆ సాహసం వెనుక అంతులేని పోరాటం, కన్నీటి గాథ ఉంటే అది చరిత్ర అవుతుంది. సరిగ్గా అలాంటి చరిత్రనే సృష్టించారు ఆస్ట్రేలియాలో శరణార్థిగా ఉంటున్న ఆఫ్ఘనిస్థాన్ మహిళ రివర్ అహ్మద్ (30). మే 21న 8,849 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్ఘన్ మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు, తాలిబన్ల పాలనలో స్వేచ్ఛ, విద్యకు దూరమవుతున్న లక్షలాది ఆఫ్ఘన్ మహిళల గొంతుకను ప్రపంచానికి వినిపించే ఒక ప్రయత్నం.
రివర్ అహ్మద్ అసలు పేరు జకియా అహ్మద్. ఆమె పుట్టిపెరిగింది ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్లోని ఘజ్నిలో. తాలిబన్ల కఠిన నిబంధనల మధ్య ఆమె బాల్యం గడిచింది. ఒకానొక దశలో యూనివర్సిటీ బస్సుపై తాలిబన్లు దాడి చేసినప్పుడు, ఆమె చాకచక్యంగా ప్రాణాలు కాపాడుకుంది. నెలసరి రక్తాన్ని ముఖానికి పూసుకుని, చనిపోయినట్టు నటించి మృత్యువు నుంచి తప్పించుకుంది. ఆ భయానక ఘటన తర్వాత, కాబూల్లో జర్నలిజం చదివి, భారత్ మీదుగా ఆస్ట్రేలియాకు శరణార్థిగా వలస వెళ్లింది.
ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాక ఆమె జీవితంలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు ఆత్మహత్య చేసుకోవడంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు, నదుల ప్రవాహం నుంచి స్ఫూర్తి పొంది తన పేరును జకియా నుంచి 'రివర్'గా మార్చుకుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి ఎక్కడంతో ఆమెకు పర్వతారోహణపై ఆసక్తి మొదలైంది. అదే ఆమెను ఎవరెస్ట్ శిఖరం వైపు నడిపించింది. ఈ యాత్ర కోసం తన పొదుపు, కొంత లోన్ కలుపుకుని సుమారు 85,000 డాలర్లు (దాదాపు రూ.70 లక్షలు) ఖర్చు చేసింది.
నేపాలీ గైడ్లు దావా టెన్జింగ్ షెర్పా, ఫుర్బా గ్యాల్జెన్ షెర్పా సహాయంతో ఆమె ఈ యాత్రను పూర్తి చేసింది. శిఖరాన్ని చేరుకున్నాక తాను ఎంతో శక్తిమంతురాలినన్న భావన కలిగిందని రివర్ తెలిపింది. "ఈ యాత్ర ఒక లక్ష్యం, స్వేచ్ఛ, విద్య కోసం. ఆఫ్ఘనిస్థాన్లో నేటికీ లక్షలాది బాలికలకు ప్రాథమిక విద్యా హక్కు నిరాకరిస్తున్నారు. నిజమైన పర్వతాలు రాళ్లతో, మంచుతో నిర్మించినవి కావు. అవి మనలో మనం మోసేవే" అని ఆమె తన లక్ష్యాన్ని స్పష్టం చేసింది. రివర్ అహ్మద్ సాధించిన ఈ విజయం, హింసను, ప్రతికూలతలను జయించి నిలబడిన ఒక మహిళ పోరాట పటిమకు, స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది.
రివర్ అహ్మద్ అసలు పేరు జకియా అహ్మద్. ఆమె పుట్టిపెరిగింది ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్లోని ఘజ్నిలో. తాలిబన్ల కఠిన నిబంధనల మధ్య ఆమె బాల్యం గడిచింది. ఒకానొక దశలో యూనివర్సిటీ బస్సుపై తాలిబన్లు దాడి చేసినప్పుడు, ఆమె చాకచక్యంగా ప్రాణాలు కాపాడుకుంది. నెలసరి రక్తాన్ని ముఖానికి పూసుకుని, చనిపోయినట్టు నటించి మృత్యువు నుంచి తప్పించుకుంది. ఆ భయానక ఘటన తర్వాత, కాబూల్లో జర్నలిజం చదివి, భారత్ మీదుగా ఆస్ట్రేలియాకు శరణార్థిగా వలస వెళ్లింది.
ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాక ఆమె జీవితంలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు ఆత్మహత్య చేసుకోవడంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు, నదుల ప్రవాహం నుంచి స్ఫూర్తి పొంది తన పేరును జకియా నుంచి 'రివర్'గా మార్చుకుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి ఎక్కడంతో ఆమెకు పర్వతారోహణపై ఆసక్తి మొదలైంది. అదే ఆమెను ఎవరెస్ట్ శిఖరం వైపు నడిపించింది. ఈ యాత్ర కోసం తన పొదుపు, కొంత లోన్ కలుపుకుని సుమారు 85,000 డాలర్లు (దాదాపు రూ.70 లక్షలు) ఖర్చు చేసింది.
నేపాలీ గైడ్లు దావా టెన్జింగ్ షెర్పా, ఫుర్బా గ్యాల్జెన్ షెర్పా సహాయంతో ఆమె ఈ యాత్రను పూర్తి చేసింది. శిఖరాన్ని చేరుకున్నాక తాను ఎంతో శక్తిమంతురాలినన్న భావన కలిగిందని రివర్ తెలిపింది. "ఈ యాత్ర ఒక లక్ష్యం, స్వేచ్ఛ, విద్య కోసం. ఆఫ్ఘనిస్థాన్లో నేటికీ లక్షలాది బాలికలకు ప్రాథమిక విద్యా హక్కు నిరాకరిస్తున్నారు. నిజమైన పర్వతాలు రాళ్లతో, మంచుతో నిర్మించినవి కావు. అవి మనలో మనం మోసేవే" అని ఆమె తన లక్ష్యాన్ని స్పష్టం చేసింది. రివర్ అహ్మద్ సాధించిన ఈ విజయం, హింసను, ప్రతికూలతలను జయించి నిలబడిన ఒక మహిళ పోరాట పటిమకు, స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది.