రూ.1 లక్ష వేతనంతో గొర్రెల కాపరి కోసం ఉద్యోగ ప్రకటన.. 700 మందికి పైగా దరఖాస్తు
- గొర్రెలు కాయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని ప్రకటన
- కొన్ని గంటల్లోనే 5.9 కోట్ల వ్యూస్తో ట్రెండింగ్
- దరఖాస్తు చేసుకున్న వారిలో వైట్ కాలర్ ఉద్యోగులు
- అయితే ఈ ఉద్యోగం అంత సులభం కాదని ప్రకటనలో వెల్లడి
మంగోలియాకు దక్షిణాన ఉన్న మారుమూల, కఠినమైన గడ్డి మైదానాలలో పనిచేయడానికి గొర్రెల కాపరుల కోసం తాను ఇచ్చిన ఉద్యోగ ప్రకటన సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ కావడం చూసి చైనాకు చెందిన వ్యవసాయ క్షేత్ర యజమాని జువో జియావోయాంగ్ ఆశ్చర్యపోయాడు. మంగోలియా సరిహద్దు ప్రాంతంలో గొర్రెలు కాయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని అతను చిన్న ప్రకటన ఇచ్చాడు.
ఈ పోస్టు కొన్ని గంటల్లోనే 'వీబో'లో 5.9 కోట్ల వ్యూస్తో ట్రెండింగ్లో మొదటిస్థానంలోకి వచ్చింది. రెండు పోస్టుల కోసం 700 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. షాంఘై, చోంగ్కింగ్ వంటి నగరాలలోని వైట్ కాలర్ ఉద్యోగులతో పాటు చైనాలోని వివిధ ఫ్యాక్టరీల కార్మికులు, విశ్వవిద్యాలయ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు.
అయితే ఈ ఉద్యోగానికి ప్రకటించిన వేతనం రూ.1 లక్షా 10 వేల రూపాయలు. చైనా ప్రైవేటు కంపెనీల యావరేజ్ శాలరీ సుమారు రూ.70 వేల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ గొర్రెల కాపరికి పెద్ద మొత్తంలో వేతనంతో పాటు ఉచిత వసతి, ఉచిత గ్రాసరీ అందజేస్తారు.
ఇది చైనా జాబ్ మార్కెట్లోని క్లిష్ట పరిస్థితులకు నిదర్శనమని చెబుతున్నారు. తన ఈ ప్రకటన ఇంత వైరల్ అవుతుందనుకోలేదని జువో అన్నాడు. దరఖాస్తు చేసుకున్న వారిలో పదోవంతు మంది అప్పుడే విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసినవారు ఉన్నట్లు చెప్పారు. మరికొందరు అప్పుల్లో కూరుకుపోయినవారు ఉన్నారని పేర్కొన్నారు.
అయితే ఈ ఉద్యోగం చేయడం అనుకున్నంత సులభం కాదు. వేసవిలో 4 వేల 900 ఎకరాల విస్తీర్ణంలో 3 వేల గొర్రెలను మేపాల్సి ఉంటుంది. శీతాకాలంలో మైనస్ 30 డిగ్రీల చలిలో వాటిని క్లీన్ చేస్తూ అక్కడే ఉండాలి. చలి తట్టుకోలేని విధంగా ఉంటుంది. ఏడాది పొడవునా మనుషులు కనిపించని ఒంటరితనం భరించాలి. ఇవన్నీ జువో ముందుగానే ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నాడు. అందుకే జువో వైట్ కాలర్ ఉద్యోగులను, నగర యువతను కాకుండా, గతంలో ఫార్మింగ్లో అనుభవం ఉండి, ఒంటరితనాన్ని తట్టుకోగల 1980లలో పుట్టిన రెండు జంటలను (మొత్తం నలుగురిని) ఎంపిక చేశాడు.
ఈ పోస్టు కొన్ని గంటల్లోనే 'వీబో'లో 5.9 కోట్ల వ్యూస్తో ట్రెండింగ్లో మొదటిస్థానంలోకి వచ్చింది. రెండు పోస్టుల కోసం 700 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. షాంఘై, చోంగ్కింగ్ వంటి నగరాలలోని వైట్ కాలర్ ఉద్యోగులతో పాటు చైనాలోని వివిధ ఫ్యాక్టరీల కార్మికులు, విశ్వవిద్యాలయ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు.
అయితే ఈ ఉద్యోగానికి ప్రకటించిన వేతనం రూ.1 లక్షా 10 వేల రూపాయలు. చైనా ప్రైవేటు కంపెనీల యావరేజ్ శాలరీ సుమారు రూ.70 వేల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ గొర్రెల కాపరికి పెద్ద మొత్తంలో వేతనంతో పాటు ఉచిత వసతి, ఉచిత గ్రాసరీ అందజేస్తారు.
ఇది చైనా జాబ్ మార్కెట్లోని క్లిష్ట పరిస్థితులకు నిదర్శనమని చెబుతున్నారు. తన ఈ ప్రకటన ఇంత వైరల్ అవుతుందనుకోలేదని జువో అన్నాడు. దరఖాస్తు చేసుకున్న వారిలో పదోవంతు మంది అప్పుడే విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసినవారు ఉన్నట్లు చెప్పారు. మరికొందరు అప్పుల్లో కూరుకుపోయినవారు ఉన్నారని పేర్కొన్నారు.
అయితే ఈ ఉద్యోగం చేయడం అనుకున్నంత సులభం కాదు. వేసవిలో 4 వేల 900 ఎకరాల విస్తీర్ణంలో 3 వేల గొర్రెలను మేపాల్సి ఉంటుంది. శీతాకాలంలో మైనస్ 30 డిగ్రీల చలిలో వాటిని క్లీన్ చేస్తూ అక్కడే ఉండాలి. చలి తట్టుకోలేని విధంగా ఉంటుంది. ఏడాది పొడవునా మనుషులు కనిపించని ఒంటరితనం భరించాలి. ఇవన్నీ జువో ముందుగానే ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నాడు. అందుకే జువో వైట్ కాలర్ ఉద్యోగులను, నగర యువతను కాకుండా, గతంలో ఫార్మింగ్లో అనుభవం ఉండి, ఒంటరితనాన్ని తట్టుకోగల 1980లలో పుట్టిన రెండు జంటలను (మొత్తం నలుగురిని) ఎంపిక చేశాడు.