మేనల్లుడిపై దాడి... బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం
- టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో దాడి
- దాడికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్న మమత బెనర్జీ
- పాలకులు హంతకులుగా మారారని తీవ్ర వ్యాఖ్య
- ఈ దాడిని ఖండించిన కాంగ్రెస్, ఎస్పీ అధినేతలు
- పోలీస్ భద్రత లేకపోవడంపై విపక్షాల విమర్శలు
శనివారం సాయంత్రం మమతా బెనర్జీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "పాలకులు హంతకులుగా మారారు. బీజేపీ సిగ్గుపడాలి" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆమె తన పోస్టులో పంచుకున్నారు. ఎన్నికల హింసలో ప్రాణాలు కోల్పోయిన సంజూ కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్పై బీజేపీ మద్దతు ఉన్న దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది.
ఈ దాడిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతకు ఉద్దేశపూర్వకంగానే సరైన పోలీస్ భద్రత కల్పించలేదని, ఇది బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించాలని, ఇలాంటి దాడులను నివారించాలని ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. టీఎంసీ కీలక నేతపై జరిగిన ఈ దాడి, బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం ద్వేషపూరిత, హింసాత్మక రాజకీయాలు మాత్రమే చేయగలదని నిరూపించిందన్నారు. సున్నితమైన వాతావరణంలో పోలీసుల గైర్హాజరు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.