వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Two years ago people rejected YSRCP says Ram Prasad Reddy
  • రెండేళ్ల క్రితం కూటమికి ప్రజలు పట్టం కట్టిన వైనం
  • విధ్వంసక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు అన్న రాంప్రసాద్ రెడ్డి
  • చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలన అంతమై, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పునాది పడిన చారిత్రాత్మక తీర్పు వెలువడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. జగన్ నేతృత్వంలోని అరాచక, విధ్వంసక పాలనకు ప్రజలు శాశ్వతంగా చరమగీతం పాడిన రోజు ఇదని అభివర్ణించారు.


గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. "వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలు పూర్తిగా విముక్తి పొందారు. రాష్ట్రాన్ని ఒక బందిపోటు దొంగల ముఠాలా నడిపిన తీరుకు ప్రజలు తమ ఓటు హక్కుతో గట్టి బుద్ధి చెప్పారు" అని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో వ్యక్తిగత కక్షలు, వేధింపుల రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ దారుణంగా వెనుకబడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ప్రజలు కూటమికి అఖండ మద్దతు ఇచ్చి గెలిపించారని మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పునర్ వైభవాన్ని సంపాదించుకుంటూ, శరవేగంగా అభివృద్ధి బాట పట్టిందని స్పష్టం చేశారు. అమరావతిని పునర్నిర్మించడం అనేది కూటమి ప్రభుత్వ దృఢ సంకల్పానికి, నిబద్ధతకు నిదర్శనమని మంత్రి వెల్లడించారు.


ఈ రెండేళ్ల స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ రంగాల్లో ఎంతో స్పష్టమైన మార్పును తీసుకువచ్చిందని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగానే తమ పాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. వైసీపీ విధ్వంసానికి ముగింపు పలికి, రాష్ట్రంలో ఒక కొత్త అభివృద్ధి యుగానికి నాంది పలికిన ఈ రోజు (జూన్ 4) ఏపీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ మరపురాని రోజుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Go Back to Shorts
Ram Prasad Reddy
TDP
YSRCP

More Telugu News