హైదరాబాద్ చాలా సేఫ్.. రాత్రిపూట ఒంటరిగా నడిచా.. యువతి వీడియో వైరల్!
- హైదరాబాద్లో రాత్రిపూట ఒంటరిగా నడిచానన్న యువతి
- నగరంలో మహిళలకు పూర్తి భద్రత ఉందని ప్రశంస
- ఉద్యోగం కోసం వచ్చి, నగరం చూసి ఫిదా అయ్యానన్న యువతి
- తొలుత ముంబైలో స్థిరపడాలనుకున్నానని వెల్లడి
- యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల స్పందన
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై ఓ యువతి పంచుకున్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లీషా అనే యువతి రాత్రిపూట నగరంలో ఒంటరిగా నడిచిన తన అనుభవాన్ని వివరిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. భాగ్యనగరం మహిళలకు అత్యంత సురక్షితమైన నగరమని ఆమె తన వీడియోలో కొనియాడింది.
ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన లీషా, ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ... "రాత్రిపూట ఒంటరిగా దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచాను. ఈ సమయంలో నాకు ఎలాంటి వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు ఎదురుకాలేదు. ఎంతో సురక్షితంగా అనిపించింది" అని ఆమె తెలిపారు. హైదరాబాద్ రాకముందు, ముంబైలో స్థిరపడాలని కలలు కన్నానని, హైదరాబాద్ను ఒక పాత నగరంగానే భావించానని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని లీషా వివరించారు. "హైదరాబాద్ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇక్కడి మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రజలు ఎంతో మర్యాదగా ఉంటారు. పగలు కాస్త వేడిగా ఉన్నా, రాత్రి వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది" అని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్ను తప్పకుండా సందర్శించాలని ఆమె అందరికీ సలహా ఇచ్చారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. చాలామంది ఆమె మాటలతో ఏకీభవించారు. "నేను కూడా ఇటీవలే హైదరాబాద్ వచ్చాను, మీరు చెప్పింది నిజం" అని ఒకరు కామెంట్ చేయగా, "ఒక్కసారి హైదరాబాద్ వస్తే, మళ్లీ వదిలి వెళ్లలేరు" అని మరొకరు రాశారు. చాలా మంది హైదరాబాద్ను "అద్భుతమైన నగరం" అంటూ ఆమె అభిప్రాయాన్ని సమర్థించారు.
ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన లీషా, ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ... "రాత్రిపూట ఒంటరిగా దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచాను. ఈ సమయంలో నాకు ఎలాంటి వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు ఎదురుకాలేదు. ఎంతో సురక్షితంగా అనిపించింది" అని ఆమె తెలిపారు. హైదరాబాద్ రాకముందు, ముంబైలో స్థిరపడాలని కలలు కన్నానని, హైదరాబాద్ను ఒక పాత నగరంగానే భావించానని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని లీషా వివరించారు. "హైదరాబాద్ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇక్కడి మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రజలు ఎంతో మర్యాదగా ఉంటారు. పగలు కాస్త వేడిగా ఉన్నా, రాత్రి వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది" అని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్ను తప్పకుండా సందర్శించాలని ఆమె అందరికీ సలహా ఇచ్చారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. చాలామంది ఆమె మాటలతో ఏకీభవించారు. "నేను కూడా ఇటీవలే హైదరాబాద్ వచ్చాను, మీరు చెప్పింది నిజం" అని ఒకరు కామెంట్ చేయగా, "ఒక్కసారి హైదరాబాద్ వస్తే, మళ్లీ వదిలి వెళ్లలేరు" అని మరొకరు రాశారు. చాలా మంది హైదరాబాద్ను "అద్భుతమైన నగరం" అంటూ ఆమె అభిప్రాయాన్ని సమర్థించారు.
More Telugu News
బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి
![]()
పదవి వచ్చిందనే అహంకారం వద్దు: నారా లోకేష్
![]()
లండన్ ప్రేమ కథతో ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. టీజర్ వచ్చేసింది
![]()
కొంపదీసి తుమ్మును ఆపుతున్నారా ఏంటి? చెవులు, మెదడుకు ముప్పు తెచ్చుకోవడమే!
![]()
కవితకు 'టీఆర్ఎస్' షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ!
![]()
సన్రైజర్స్తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై... ఇవాళ కూడా 'హిట్ మ్యాన్' లేడు!
![]()
కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు: నారా లోకేశ్
![]()
ఎగ్జిట్ పోల్స్: బెంగాల్లో హోరాహోరీ, తమిళనాడులో డీఎంకేకు మొగ్గు, కేరళలో ఉత్కంఠ
![]()
అసోంలో బీజేపీ హవా, పుదుచ్చేరిలో ఎన్డీయే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు
![]()
ఒక లీటరు ఇంధనం కోసం 10,000 లీటర్ల నీరా? భారత ఇథనాల్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం!
![]()
బెంగాల్లో ముగిసిన చివరి దశ పోలింగ్... మే 4న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
![]()
సుదీర్ఘకాలంగా కేసు.. అసహనంతో 2046కు వాయిదా వేసిన న్యాయమూర్తి!!
![]()
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు
![]()
సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
![]()
బెంగాల్లో మేం గెలుస్తున్నాం: కోల్కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ
![]()