ప్రేయసిని తీసుకురావాలంటూ 300 అడుగుల టవర్ ఎక్కిన ప్రేమికుడు!

  • ప్రియురాలి కోసం బీహార్‌లో టవర్ ఎక్కిన యువకుడు
  • ముజఫర్‌పూర్‌లో 300 అడుగుల ఎత్తులో గంటల తరబడి హల్‌చల్
  • తనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం
  • ప్రేయసిని తీసుకురాకపోతే దూకేస్తానని బెదిరింపు
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ యువకుడు ప్రేమ కోసం చేసిన పని తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. తన ప్రియురాలిని తీసుకురావాలంటూ ఏకంగా 300 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కి, కిందకు దూకుతానని బెదిరించాడు. బుధవారం ఉదయం ముజఫర్‌పూర్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనీష్ కుమార్ అనే యువకుడు తెల్లవారుజామునే టవర్ ఎక్కి గంటల తరబడి అక్కడే ఉండిపోయాడు. దీంతో అతడిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ ఘటనలో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఉదయం 11 గంటల సమయంలో అనీష్ స్వయంగా 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తన గురించి పోలీసులకు చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన యువతితో తాను ప్రేమలో ఉన్నానని, ఆమెతో తనను కలపకపోతే టవర్ పైనుంచి దూకేస్తానని హెచ్చరించాడు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పుణేలో టైల్స్ షాపులో పనిచేసే అనీష్ మంగళవారం పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి ఈ పని చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అధికారులు అతని కుటుంబ సభ్యుల సహాయంతో అనీష్‌కు కౌన్సెలింగ్ ఇస్తూ, సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గంటల తరబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Anish Kumar
Muzaffarpur
Bihar
love affair
mobile tower
suicide threat
police
Uttar Pradesh
Deoria
girlfriend

More Telugu News