బీజేపీ ఓటు బ్యాంకు విజయన్కు బదిలీ అయ్యేలా మోదీ ప్రయత్నిస్తున్నారు: కేరళలో ప్రచారంలో రేవంత్ రెడ్డి
- ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రేవంత్ రెడ్డి రోడ్ షో
- ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్కు తేడా ఏమీలేదన్న తెలంగాణ సీఎం
- కేరళ ప్రజలు చాలా తెలివైనవారన్న రేవంత్ రెడ్డి
కేరళలో బీజేపీ ఓటు బ్యాంకు సీఎం పినరయి విజయన్కు బదిలీ అయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరువనంతపురంలోని ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్కు తేడా ఏమీ లేదని ఆయన విమర్శించారు.
కేరళ ప్రజలు చాలా తెలివైనవారని, విద్యావంతులను, మతతత్వ శక్తులను అస్సలు అనుమతించరని అన్నారు. బీజేపీ లాంటి పార్టీలు అధికారంలోకి రాకుండా కేరళ ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని వ్యాఖ్యానించారు. కేరళకు భవిష్యత్తు లేకుండా చేయాలని మోదీ, పినరయి విజయన్ చూస్తున్నారని ఆరోపించారు. అందుకే బీజేపీ ఓటు బ్యాంకును ఎల్డీఎఫ్కు బదిలీ అయ్యేలా చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కేరళలో పినరయి విజయన్ సమయం అయిపోయిందని, యూడీఎఫ్ సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడానికి అవకాశమే లేదని అన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ పాలించేది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది తమ పార్టీయేనని అన్నారు.
కేరళ ప్రజలు చాలా తెలివైనవారని, విద్యావంతులను, మతతత్వ శక్తులను అస్సలు అనుమతించరని అన్నారు. బీజేపీ లాంటి పార్టీలు అధికారంలోకి రాకుండా కేరళ ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని వ్యాఖ్యానించారు. కేరళకు భవిష్యత్తు లేకుండా చేయాలని మోదీ, పినరయి విజయన్ చూస్తున్నారని ఆరోపించారు. అందుకే బీజేపీ ఓటు బ్యాంకును ఎల్డీఎఫ్కు బదిలీ అయ్యేలా చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కేరళలో పినరయి విజయన్ సమయం అయిపోయిందని, యూడీఎఫ్ సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడానికి అవకాశమే లేదని అన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ పాలించేది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది తమ పార్టీయేనని అన్నారు.