ఇరాన్ పూర్తిగా బలహీనపడేవరకు యుద్ధం కొనసాగించండి: ట్రంప్కు గల్ఫ్ దేశాల విజ్ఞప్తి
- ట్రంప్ను ప్రైవేటుగా కోరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ కథనం
- ట్రంప్ను కోరిన దేశాల్లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్
- ఇరాన్ నాయకత్వంలో మార్పు వచ్చేవరకు సైనికచర్య ఆగకూడదని విజ్ఞప్తి
ఇరాన్ పూర్తిగా బలహీనపడే వరకు లేదా ఓడిపోయేవరకు యుద్ధాన్ని కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గల్ఫ్ దేశాలు విజ్ఞప్తి చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ సంచలన కథనం వెల్లడించింది. ప్రస్తుత పాలనాయంత్రాంగం పూర్తిగా కూలిపోయేంత వరకు యుద్ధం ముగించవద్దని ట్రంప్ను పలు గల్ఫ్ దేశాలు ప్రైవేటుగా కోరాయి. ఈ కథనం ప్రకారం, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలు ట్రంప్ను కోరాయి.
నెల రోజులుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇరాన్ అంతగా బలహీనపడలేదని, కాబట్టి యుద్ధాన్ని కొనసాగించాలని ఆ దేశాలు కోరాయి. ఇరాన్ నాయకత్వంలో గణనీయమైన మార్పు రావాలని, అప్పటి వరకు సైనిక చర్య ఆగకూడదని ఆ దేశాల అధికారులు ప్రైవేటు సంభాషణలో భాగంగా ట్రంప్ను కోరినట్లు ఆ కథనం తెలిపింది.
అయితే, యుద్ధం ప్రారంభానికి ముందు తమకు సమాచారం ఇవ్వకపోవడం, యుద్ధం కారణంగా సంభవించే హెచ్చరికలను పట్టించుకోకపోవడంపై ఈ చర్చల సందర్భంగా ఆయా దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయని తెలుస్తోంది. యుద్ధం ఎలాగూ ప్రారంభమైనందున, టెహ్రాన్ పాలనను పూర్తిగా కూలదోయాలని, ఇది చరిత్రాత్మక అవకాశమని కొన్ని దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయని ఆ కథనం పేర్కొంది.
నెల రోజులుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇరాన్ అంతగా బలహీనపడలేదని, కాబట్టి యుద్ధాన్ని కొనసాగించాలని ఆ దేశాలు కోరాయి. ఇరాన్ నాయకత్వంలో గణనీయమైన మార్పు రావాలని, అప్పటి వరకు సైనిక చర్య ఆగకూడదని ఆ దేశాల అధికారులు ప్రైవేటు సంభాషణలో భాగంగా ట్రంప్ను కోరినట్లు ఆ కథనం తెలిపింది.
అయితే, యుద్ధం ప్రారంభానికి ముందు తమకు సమాచారం ఇవ్వకపోవడం, యుద్ధం కారణంగా సంభవించే హెచ్చరికలను పట్టించుకోకపోవడంపై ఈ చర్చల సందర్భంగా ఆయా దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయని తెలుస్తోంది. యుద్ధం ఎలాగూ ప్రారంభమైనందున, టెహ్రాన్ పాలనను పూర్తిగా కూలదోయాలని, ఇది చరిత్రాత్మక అవకాశమని కొన్ని దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయని ఆ కథనం పేర్కొంది.