కుప్పకూలిన సూచీలు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 1,690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 486 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • మధ్యప్రాచ్య అనిశ్చితితో అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఢమాల్
  • రెండు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ సూచీలు కుప్పకూలాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలపై నెలకొన్న ఉత్కంఠతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా, సెన్సెక్స్ 1,690.25 పాయింట్లు నష్టపోయి 73,583.22 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 486.85 పాయింట్లు క్షీణించి 22,819.60 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 4.55 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. అయితే, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ షేర్లు మాత్రం లాభాల్లో ముగియడం గమనార్హం.

రంగాల వారీగా చూస్తే, ఐటీ మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు, రియాల్టీ, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. బ్రాడర్ మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.24 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.88 శాతం మేర నష్టపోయాయి.

ప్రస్తుత మార్కెట్ అనిశ్చితి దృష్ట్యా, సూచీలు పెరిగినప్పుడు అమ్మకాలు జరపడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 23,500 స్థాయికి చేరినప్పుడు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని, ఒకవేళ 22,800 స్థాయిని కోల్పోతే మార్కెట్ మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Market Crash
Share Market
Reliance Industries
HDFC Bank
Investment
Market Analysis

More Telugu News