50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు: స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్

  • 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఆడిట్
  • 754 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా 377 వాటిల్లో లోపాలు గుర్తింపు
  • ఇందులో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువగా ఉందనివెల్లడి
దేశంలోని 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ తాజాగా వెల్లడించింది. ఏడాదికాలంగా చేపట్టిన తనిఖీల్లో వాటిని గుర్తించినట్లు వెల్లడించింది. తరుచూ అవే సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయని పేర్కొంది. 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి వరకు 754 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా 377 వాటిల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.

ఆడిట్ చేసిన వాటిల్లో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువగా ఉందని, లోపాలు కూడా వాటిలోనే అధికంగా ఉన్నట్లు కమిటీ తెలిపింది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు 405 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా, 148 ఫ్లైట్‌లలో లోపాలు ఉన్నాయని తెలిపింది. కొన్ని లోపాలు రిపీట్ అయినట్లు పేర్కొంది. 166 ఎయిరిండియా, 101 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో తనిఖీలు చేపట్టగా, వాటిలోనూ లోపాలు వెలుగుచూశాయి.

దాదాపు సగం లోపాలు ఈ రెండు విమానయాన సంస్థలకు చెందిన వాటిల్లోనే ఉన్నట్లు తెలిపింది. ఈ స్థాయిలో లోపాలు వెలుగుచూడటంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రయాణికుల భద్రత, సంస్థల విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది. గత సంవత్సరం అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియాపై డీజీసీఏ నిర్వహించిన ఆడిట్‌ను కూడా నివేదిక ప్రస్తావించింది.

Standing Committee on Civil Aviation
Commercial flights
Technical issues
Indigo flights
Air India

More Telugu News