అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్

  • శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్
  • ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడని వ్యాఖ్య
  • ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష
శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన సందేశం ఇచ్చారు.

ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు అని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

YS Jagan
YS Jagan Mohan Reddy
Sri Rama Navami
AP Politics
Telugu People
Rama Navami Wishes
Andhra Pradesh
Indian Politics

More Telugu News