గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన

  • ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లు
  • సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు
  • ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన
  • కరీంనగర్‌లో నేడు అధికారికంగా పాటల విడుదల
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను స్థాపించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ గాయకుడి అవతారమెత్తారు. సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఆ సంస్థ గీతాలను ఆలపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పుడీ ప్రోమో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు (శుక్రవారం) ఈ పాటలను కరీంనగర్‌లో విడుదల చేయనున్నారు. బండి సంజయ్ పాడిన పాటలకు వందేమాత్రం శ్రీనివాస్ సంగీతం అందించినట్టు తెలిసింది.  బండి పాటకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయన స్వరం బాగుందని ప్రశంసిస్తున్నారు. 







Bandi Sanjay
RSS
Rashtriya Swayamsevak Sangh
Vande Mataram Srinivas
Karimnagar
Sri Rama Navami
Telugu Songs
Political Songs
BJP

More Telugu News