పవన్ కల్యాణ్‌ను కలిసిన యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ... ఫొటోలు ఇవిగో!

  • ఒబేసిటీ ముక్త్ భారత్ యాత్రపై బైకర్ తాప్సీ ఉపాధ్యాయ
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలో సమావేశం
  • ఇప్పటివరకు 17,400 కి.మీ. ప్రయాణించి 16 రాష్ట్రాలు పూర్తి
  • తాప్సీ యాత్ర యువతకు స్ఫూర్తి కావాలన్న పవన్ కల్యాణ్
దేశవ్యాప్తంగా ప్రజారోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంటరిగా బైక్‌పై యాత్ర చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతి తాప్సీ ఉపాధ్యాయను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. "ఒబేసిటీ ముక్త్ భారత్ - మిషన్ హెల్తీ భారత్" యాత్రలో భాగంగా ఆమె గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తన యాత్ర వివరాలను తాప్సీ పవన్‌కు వివరించారు. ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు మార్చి 9న మీరట్‌లో ఈ సోలో బైక్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. బుల్లెట్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఇప్పటివరకు సుమారు 17,400 కిలోమీటర్లు పూర్తి చేశానని, 16 రాష్ట్రాల్లోని 500కు పైగా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించానని చెప్పారు. మిగిలిన 12 రాష్ట్రాల్లో కూడా తన యాత్రను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు.

తాప్సీ ఉపాధ్యాయ సాహసోపేతమైన సంకల్పాన్ని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించి, యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దేశ ప్రజల ఆరోగ్యం కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన అభిలషించారు. 23 ఏళ్ల తాప్సీ చేపట్టిన ఈ మిషన్ గొప్పదని కొనియాడారు.

Pawan Kalyan
Taapsee Upadhyay
Bike Yatra
Obesity Mukt Bharat
Mission Healthy Bharat
Uttar Pradesh
Public Health Awareness
Mangalagiri
Political News
India

More Telugu News