ఇప్ప పువ్వు సారాతో రూ. లక్ష కోట్ల ఆదాయం.. అసెంబ్లీలో రేపు పూర్తి వివరాలు చెబుతా: అనిరుధ్ రెడ్డి
- ఇప్పు పువ్వు సారా తాగిన వారు 115 ఏళ్లు బతికారన్న అనిరుధ్ రెడ్డి
- ఇప్ప పువ్వు సారాను శాస్త్రీయంగా ఉత్పత్తి చేస్తే రూ. లక్ష కోట్ల రెవెన్యూ వస్తుందన్న ఎమ్మెల్యే
- విదేశాలకు కూడా ఎగుమతి చేయొచ్చని సూచన
ఇప్ప పువ్వు సారాపై తనకున్న అవగాహనను తక్కువ అంచనా వేయవద్దని, దీనిపై అసెంబ్లీ వేదికగా రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తానని కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన, తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్కు తన ప్రసంగమే సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం వినోదం కోసం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి ఇప్ప పువ్వుకు ఉందని అన్నారు.