ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్
- గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ గన్పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
- గ్యాస్ కొరత లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని విమర్శ
- పెట్రోలియం శాఖ తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపాటు
రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గన్పార్కు వద్ద కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల సాకుతో సామాన్యులకు సిలిండర్లు దొరకకుండా చేస్తున్నారని, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని కేటీఆర్ మండిపడ్డారు.