అమరావతి కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కనిపిస్తాయి: మంత్రి నారాయణ
- అమరావతిలోని ప్రతి కట్టడం ఐకానిక్ గా ఉంటుందన్న నారాయణ
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాసాలు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వెల్లడి
- సెక్రటేరియట్, హైకోర్టు వంటి భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమన్న మంత్రి
రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయని హెచ్చరించారు. అమరావతిలో నిర్మించబోయే ప్రతి కట్టడం 'ఐకానిక్'గా ఉంటుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రపంచంలోనే అత్యుత్తమ శాసనసభ కేంద్రంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.