ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తాం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

  • యుద్ధం లక్ష్యాలను సాధించేవరకు ఆపేది లేదని స్పష్టీకరణ
  • ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు ఉధృతం చేస్తామన్న కాట్జ్
  • ఆ దేశ పాలనా యంత్రాంగం, కమాండర్లను లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడి
ఇరాన్‌పై వచ్చేవారం దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు ఉద్ధృతం చేస్తామని కాట్జ్ తెలిపినట్లుగా ఇజ్రాయెల్ పత్రిక ఒకటి తెలిపింది. ఇరాన్ పాలకులు, ఆ దేశానికి ఆదాయవనరుగా ఉన్న మౌలిక సదుపాయాలపై తమ రెండు దేశాలు జరిపే దాడులు మరింత పెరుగుతాయని అన్నారు.

ఈ యుద్ధం లక్ష్యాలను సాధించేవరకు ఆపేది లేదని కాట్జ్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు, అమెరికా ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయే వరకు ఆ దేశ పాలనా యంత్రాంగం, కమాండర్లు, వ్యూహాత్మక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేశారు.

ఇరాన్‌పై క్రమంగా సైనిక చర్యను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ మంత్రి నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇరాన్ నుంచి అణుముప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం, ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛను కల్పించడమే తమ ముందున్న లక్ష్యాలని అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ అన్నారు.

Israel Katz
Iran
Israel
United States
Military Attacks
Benjamin Netanyahu
Middle East
Nuclear Threat

More Telugu News