నా పోరాటం ముగ్గురిపైనే: కవిత

  • జాగృతి కార్యాలయంలో కవిత ఉగాది వేడుకలు
  • డాడీ, మోడీ, చిన్న మోడీ (కేటీఆర్)ల పైనే తన పోరాటం అని వెల్లడి
  • మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ప్రారంభిస్తానన్న కవిత

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన రాజకీయ అజెండాను స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తన పోరాటం ఎవరితోనో కాదని.. "డాడీ (కేసీఆర్), మోడీ (పీఎం నరేంద్ర మోడీ), చిన్నమోడీ (కేటీఆర్)" లపైనేనని ఆమె సంచలన ప్రకటన చేశారు.

 

బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అంతర్గత విభేదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు కవిత మండిపడ్డారు. తన రాజకీయ ప్రయాణం స్వతంత్రంగా ఉంటుందని, ఎవరికీ అడ్వాంటేజ్‌గా మారబోనని ఆమె స్పష్టం చేశారు. "మంచి ముహూర్తం చూసుకుని పార్టీని ప్రారంభిస్తా.. అప్పుడే నా లక్ష్యాలను ప్రజల ముందు ఉంచుతాను" అని ఆమె అన్నారు.


మరోవైపు, కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌లో జరుగుతున్న జాప్యంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు సానుకూల తీర్పునిచ్చింది. 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) పేరుతో దాఖలైన దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో పార్టీ అధికారిక ప్రకటనకు ఉన్న సాంకేతిక అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.


Kalvakuntla Kavitha
Kavitha
BRS Party
Telangana Politics
KCR
Narendra Modi
KTR
Revanth Reddy
Telangana Praja Jagruthi
Delhi High Court

More Telugu News