ఈసారి ఐపీఎల్ విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే!
- ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందన్న డివిలియర్స్
- ఈసారి భారం మొత్తం కోహ్లీ ఒక్కడి పైనే ఉండదని వ్యాఖ్య
- ఆర్సీబీ ఈ సీజన్లో దుమ్ము రేపడం ఖాయమన్న దక్షిణాఫ్రికా దిగ్గజం
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ పోరు ప్రారంభం కానున్న నేపథ్యంలో, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లోనూ ట్రోఫీని ముద్దాడి వరుసగా రెండోసారి విజేతగా నిలుస్తుందని ఆయన జోస్యం చెప్పాడు.
కేవలం సీనియర్లే కాకుండా, ఈ సీజన్లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగుతున్న యువ ఆటగాళ్ల ప్రతిభను కూడా ఏబీ కొనియాడాడు. వారి మెరుపులు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాయని పేర్కొన్నాడు.