డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్
- తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగం
- ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం
- 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణా కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం, పార్టీ విలువలకు కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది.