గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ

  • ఖమ్మం జిల్లా త్రీటౌన్ ప్రాంతంలో విషాదం
  • గృహ ప్రవేశ వేడుకకు హాజరైన 40 ఏళ్ల సుస్మిత
  • ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు
ఒక గృహ ప్రవేశ వేడుకకు హాజరైన ఓ మహిళ ఆ ఇంటి వారితో ఫొటో దిగుతూనే కుప్పకూలిపోయింది. ఈ విషాద సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలోని త్రీటౌన్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల సుస్మిత తన బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో ఫొటో దిగేందుకు వేదిక వద్దకు చేరుకుంది.

వారికి శుభాకాంక్షలు చెప్పి, ఫొటో దిగుతుండగానే ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. పక్కన ఉన్న యువతి భుజంపై చేయి వేసి ఫొటో దిగుతుండగా ఈ ఘటన జరిగింది. పక్కనున్న వారు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె కొన్ని రోజులుగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Sushmita
Khammam
Telangana
Housewarming ceremony
Cardiac arrest
Sudden death
Heart disease
Three Town Khammam

More Telugu News