పవన్ కల్యాణ్‌ను కలిసిన నందమూరి బాలకృష్ణ, నాగబాబు!

  • ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వక భేటీ
  • పవన్ కల్యాణ్‌తో మొదట బాలకృష్ణ, ఆ తర్వాత నాగబాబు సమావేశం
  • గిద్దలూరు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతిపత్రం అందజేత
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుడిని కలిశారు.

అంతకుముందు, శాసనసభలో మంత్రి లోకేశ్, నందమూరి బాలకృష్ణ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ ఏదో చెబుతుండగా లోకేశ్ ఆసక్తిగా వింటున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా, గిద్దలూరు నియోజకవర్గం సమస్యలపై పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.


Pawan Kalyan
Nandamuri Balakrishna
Nagababu
Andhra Pradesh
AP Assembly
TDP
Janasena Party

More Telugu News