తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

Telangana Municipal Elections Campaign Ends Polling on the 11th
  • రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు 11వ తేదీన పోలింగ్
  • ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 వరకు పోలింగ్
  • ఈ నెల 13న ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈరోజుతో ప్రచారం ముగియడంతో రాష్ట్రంలో మైకులు మూగబోయాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

అనివార్యమైతే ఈ నెల 12న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. గెలిచిన వారు మరుసటి రోజు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
Go Back to Shorts
Telangana Municipal Elections
Telangana Elections
Municipal Elections 2024
Telangana Local Body Elections

More Telugu News