2029లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: అనిల్ కుమార్ యాదవ్

  • రాష్ట్రంలో ఆటవిక పాలనకు తెరలేపారన్న అనిల్ యాదవ్
  • మరో మూడేళ్లు ఆటవిక పాలన భరిస్తామని వ్యాఖ్య
  • సీఎం, డిప్యూటీ సీఎం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్న అనిల్
వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతూ కూటమి నేతలు ఆటవిక పాలనకు తెరలేపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీని రావణకాష్ఠంగా మార్చారని మండిపడ్డారు. మరో మూడేళ్ల పాటు ఆటవిక పాలనను భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. 

కాపు, బీసే నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అనిల్ విమర్శించారు. తిరుమల లడ్డూ గురించి దుష్ప్రచారం చేసి అడ్డంగా దొరికేశారని... దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి నేతలకు దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి సవాలు విసరాలని ఛాలెంజ్ చేశారు.

Anil Kumar Yadav
YSRCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Pawan Kalyan
AP Elections 2024
TDP
Janasena
Political Violence
Andhra Pradesh

More Telugu News