తిరుమలలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన నిర్మలా సీతారామన్

  • తిరుమల అన్నప్రసాద కాంప్లెక్స్‌ను సందర్శించిన నిర్మల
  • భక్తులకు స్వయంగా అన్నం వడ్డించిన కేంద్ర మంత్రి
  • భక్తులతో కలిసి కూర్చుని అన్నప్రసాదం స్వీకరణ
  • ఆహార నాణ్యత, రుచిని పరిశీలించిన వైనం
  • అన్నదానంపై భక్తుల అభిప్రాయాలు సేకరణ
  • టీటీడీ సేవలను కొనియాడిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమలలో సామాన్య భక్తురాలిగా మారిపోయారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఆమె, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్‌లో భక్తులకు స్వయంగా వడ్డన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

శుక్రవారం నాడు తిరుమలలోని అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించిన ఆమె, అక్కడి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వడ్డించారు. కేవలం వడ్డించడమే కాకుండా, భక్తుల పక్కనే కూర్చుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. టీటీడీ అందిస్తున్న భోజనం రుచి, నాణ్యత ఎలా ఉన్నాయని పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదంపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా అందించడం ఆధ్యాత్మిక సేవకు గొప్ప నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Nirmala Sitharaman
Tirumala
TTD
Anna Prasadam
Free meals
Tirupati
Andhra Pradesh
Hindu Temple
Matrusri Tarigonda Vengamamba Anna Prasada Complex

More Telugu News