గుంటూరులో దారుణం .. ఇద్దరు పిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Sheikh Yusuf Kills Children and Commits Suicide in Guntur
  • గుంటూరు సాయిబాబా కాలనీలో ఘటన
  • కుటుంబ కలహాలతో తన పిల్లలను తండ్రి షేక్ యూసఫ్ చంపిన వైనం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుంటూరు సాయిబాబా కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి ఇద్దరు పిల్లల పాలిట యముడయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. షేక్ యూసఫ్ తన భార్యతో గొడవపడి, ఇద్దరు పిల్లలను తీసుకుని గుంటూరులోని తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన పిల్లలు హుస్సేన్, ఆరిఫ్‌లకు ఎలుకల మందు పెట్టి చంపి, ఆ తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Go Back to Shorts
Sheikh Yusuf
Guntur
Suicide
Family Dispute
Children Killed
Sai Baba Colony
Andhra Pradesh Crime
Poison
Crime News
Guntur Crime

More Telugu News