రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయింది: యాంకర్ శ్యామల

  • పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ స్పందన
  • ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన యాంకర్ శ్యామల
  • పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ప్రజలు గమనించారన్న శ్యామల
  • ఎన్నికల వెబ్ కాస్టింగ్ ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా స్పందించారు. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల నాటి వెబ్ కాస్టింగ్ ఫుటేజీని ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు.

ఈ మేరకు శ్యామల సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనించారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయనే విషయం అందరికీ అర్థమైందని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో అధికార టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన శ్యామల, ప్రభుత్వ పారదర్శకతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పులివెందులలో బీటెక్ రవి అర్ధాంగి మారెడ్డి లతారెడ్డి, ఒంటిమిట్టలో ముద్దుకృష్ణారెడ్డి గెలుపొందారు. ముఖ్యంగా, జగన్ అడ్డా పులివెందులలో సాధించిన విజయంతో టీడీపీ శ్రేణులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి .

Anchor Shyamala
YCP
YSRCP
Andhra Pradesh
ZPTC Election
Pulivendula
Ontimitta
TDP
Webcasting Footage
B Tech Ravi

More Telugu News