నేడు యాదాద్రి స్వర్ణ గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy going to Yadagirigutta
  • నేడు యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి
  • యాదాద్రి మహా కుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
  • కార్యక్రమానికి హాజరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాదగిరిగుట్ట పర్యటనకు వెళుతున్నారు. యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ఆయన స్వామివారికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. ఈ ఉదయం 11.54 గంటలకు మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంతో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. 

ఈ విమాన స్వర్ణ గోపురానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డు నెలకొల్పింది. 50.5 అడుగుల ఎత్తు... 10,759 చదరపు అడుగుల వైశాల్యంతో గోపురం ఉంది. దీని కోసం 68 కేజీల బంగారాన్ని వాడారు. ఈనాటి కార్యక్రమంలో 25 వేల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Yadagirigutta

More Telugu News