నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ డిమాండ్లు... టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు

  • ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దన్న పార్టీ అధిష్ఠానం
  • బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆదేశం
  • వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించవద్దని సూచన
ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీరియస్ అయిన టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యుత్సాహం వద్దని, ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. మీడియా ముందు ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది. ఏ అంశమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుని, నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. వ్యక్తిగత అభిప్రాయాలను బయటకు వెల్లడించవద్దని పేర్కొంది. 

నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ల నేపథ్యంలో జనసేన వర్గీయుల నుంచి కౌంటర్ అటాక్ మొదలయింది. "లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయండి... అందులో తప్పేమీ లేదు...  పవన్ కల్యాణ్ ను సీఎం చేయండి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దంటూ టీడీపీ నేతలకు సూచించింది.

Nara Lokesh
Deputy CM
Telugudesam
Janasena

More Telugu News