మహిళా అభిమానులు చుట్టుముడితే ధోనీ ఎలా డీల్ చేస్తాడో తెలుసా?
- అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా, ధోనీకి ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్
- ధోనీకి భారీగానే మహిళా అభిమానులు
- లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ఏం చేస్తాడనే ప్రశ్నకు ధోనీ ఆసక్తికర సమాధానం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా, ఎంఎస్డీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోనీ ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం అతడిని చుట్టేస్తుంటారు.
ఇక మహిళా అభిమానులు కూడా ధోనీకి అదే స్థాయిలో ఉన్నారు. అయితే, లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ధోనీ ఏం చేస్తాడు? ముఖ్యంగా భార్య సాక్షి సింగ్ తన పక్కనే ఉంటే, వాళ్లను ఎలా డీల్ చేస్తాడు? అనే ఆసక్తికర ప్రశ్నలకు మహీనే స్వయంగా సమాధానం చెప్పాడు.
ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన ధోనీకి "మీ చుట్టు లేడీ ఫ్యాన్స్ ఉంటే మీరేం చేస్తారు? అప్పుడు మీ భార్య పక్కనే ఉండాలని మీరు అనుకుంటారా?" అని ఓ విలేకరి ధోనీని ప్రశ్నించారు. దీనికి ధోనీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
"తను (సాక్షి) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఒకవేళ ఆమె నా పక్కన లేకపోయినప్పటికీ, తను నాతోనే ఉన్నట్లు భావిస్తా. అదే మంచిది కూడా. నేను సేఫ్గా ఉండాలంటే అలా అనుకోవడమే బెటర్" అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.
ఇక ధోనీ, సాక్షి 2007 జులై 4న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు జీవా అనే కూతురు ఉంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఎంఎస్డీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అతని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐదుసార్లు టైటిల్ గెలిచింది.
గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. ఇక 2025 మెగా ఐపీఎల్ వేలంలో సీఎస్కే ధోనీని 'అన్క్యాప్డ్ ప్లేయర్' కింద కేవలం రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకుంది.
ఇక మహిళా అభిమానులు కూడా ధోనీకి అదే స్థాయిలో ఉన్నారు. అయితే, లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ధోనీ ఏం చేస్తాడు? ముఖ్యంగా భార్య సాక్షి సింగ్ తన పక్కనే ఉంటే, వాళ్లను ఎలా డీల్ చేస్తాడు? అనే ఆసక్తికర ప్రశ్నలకు మహీనే స్వయంగా సమాధానం చెప్పాడు.
ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన ధోనీకి "మీ చుట్టు లేడీ ఫ్యాన్స్ ఉంటే మీరేం చేస్తారు? అప్పుడు మీ భార్య పక్కనే ఉండాలని మీరు అనుకుంటారా?" అని ఓ విలేకరి ధోనీని ప్రశ్నించారు. దీనికి ధోనీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
"తను (సాక్షి) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఒకవేళ ఆమె నా పక్కన లేకపోయినప్పటికీ, తను నాతోనే ఉన్నట్లు భావిస్తా. అదే మంచిది కూడా. నేను సేఫ్గా ఉండాలంటే అలా అనుకోవడమే బెటర్" అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.
ఇక ధోనీ, సాక్షి 2007 జులై 4న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు జీవా అనే కూతురు ఉంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఎంఎస్డీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అతని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐదుసార్లు టైటిల్ గెలిచింది.
గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. ఇక 2025 మెగా ఐపీఎల్ వేలంలో సీఎస్కే ధోనీని 'అన్క్యాప్డ్ ప్లేయర్' కింద కేవలం రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకుంది.
More Telugu News
బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి
![]()
పదవి వచ్చిందనే అహంకారం వద్దు: నారా లోకేష్
![]()
లండన్ ప్రేమ కథతో ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. టీజర్ వచ్చేసింది
![]()
కొంపదీసి తుమ్మును ఆపుతున్నారా ఏంటి? చెవులు, మెదడుకు ముప్పు తెచ్చుకోవడమే!
![]()
కవితకు 'టీఆర్ఎస్' షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ!
![]()
సన్రైజర్స్తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై... ఇవాళ కూడా 'హిట్ మ్యాన్' లేడు!
![]()
కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు: నారా లోకేశ్
![]()
ఎగ్జిట్ పోల్స్: బెంగాల్లో హోరాహోరీ, తమిళనాడులో డీఎంకేకు మొగ్గు, కేరళలో ఉత్కంఠ
![]()
అసోంలో బీజేపీ హవా, పుదుచ్చేరిలో ఎన్డీయే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు
![]()
ఒక లీటరు ఇంధనం కోసం 10,000 లీటర్ల నీరా? భారత ఇథనాల్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం!
![]()
బెంగాల్లో ముగిసిన చివరి దశ పోలింగ్... మే 4న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
![]()
సుదీర్ఘకాలంగా కేసు.. అసహనంతో 2046కు వాయిదా వేసిన న్యాయమూర్తి!!
![]()
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు
![]()
సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
![]()
బెంగాల్లో మేం గెలుస్తున్నాం: కోల్కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ
![]()