పత్తి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు: విజయసాయిరెడ్డి ట్వీట్

Cotton farmers are suffering says Vijayasai Reddy
  • పత్తి కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న విజయసాయి
  • దేశంలో కేవలం 20 కాటన్ కార్పొరేషన్ కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నాయని వ్యాఖ్య
  • ఈ విషయంలో కేంద్ర టెక్స్ టైల్ మంత్రి జోక్యం చేసుకోవాలని విన్నపం
ఏపీలోని పత్తి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లలో జాప్యం, తగ్గిన ధరలు పత్తి రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. మన దేశంలోని 31 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల్లో కేవలం 20 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర టెక్స్ టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ జోక్యం చేసుకోవాలని... కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా కాటన్ కార్పొరేషన్ కు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP

More Telugu News