బీఆర్ఎస్ నేతలను తలుచుకుంటే బాధగా ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy warns brs
  • మేమేం చేయకముందే బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారని విమర్శ
  • ముందుందు ముసళ్ల పండగ అని హెచ్చరిక
  • బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని వ్యాఖ్య
గులాబీ నేతలను తలుచుకుంటే బాధగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... తాము ఏం చేయకముందే బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ముందుందు ముసళ్ల పండగ అని హెచ్చరించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. ఆ పార్టీని తలుచుకుంటే జాలేస్తోందన్నారు.
Go Back to Shorts
Komatireddy Raj Gopal Reddy
BRS
Congress

More Telugu News