ఏపీ సీఎం భద్రతా ఏర్పాట్లలో మార్పు.. పరదాలను తొలగించిన అధికారులు!

  • చంద్రబాబు తిరుమల పర్యటనలో పరదాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • వాటిని తొలగించాలని సీఎం ఆదేశం
  • సీఎంను ప్రజలకు దూరం చేసే చర్యలు చేపట్టొద్దని సూచన
తిరుమలలో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన పరదాలను అధికారులు తొలగించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుమునుపు, చంద్రబాబు వెళ్లనున్న మార్గాల్లోనూ అధికారులు తెరలు కట్టారు. అయితే, తన పర్యటనలో పరదాలు కట్టి, అనవసర ఆంక్షలు పెట్టొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పాత పద్ధతులను వీడాలని, సీఎంను ప్రజలకు దూరం చేసే చర్యలు చేపట్టొద్దని సూచించారు. దీంతో, అధికారులు పరదాల తొలగింపు చేపట్టారు.

Chandrababu
Tirumala
Andhra Pradesh
YSRCP

More Telugu News