జాతీయ భద్రతాసలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ నియామకం

  • జాతీయ భద్రతాసలహాదారుగా మూడోసారి అవకాశం
  • ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రాకు అవకాశం
  • ప్రధాని సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌ల నియామకం
జాతీయ భద్రతాసలహాదారుగా మరోసారి అజిత్ దోవల్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతాసలహాదారుగా ఆయనకు అవకాశం ఇవ్వడం ఇది మూడోసారి. అలాగే, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రాకు మరోసారి అవకాశమిచ్చినట్లు తెలిపింది. జూన్ 10వ తేదీ నుంచి ఆయన బాధ్యతల్లో ఉన్నారని ఈరోజు వెల్లడించింది. ప్రధాని సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌లను నియమించినట్లు పేర్కొంది. 

Ajit Doval
BJP

More Telugu News