ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మాజీ సీఎం జగన్

  • దేశంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
  • కేంద్రంలో ఎన్డీయే 3.0
  • మూడో పర్యాయం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ
కేంద్రంలో ఎన్డీయే 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మోదీపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఏపీ మాజీ సీఎం జగన్ కూడా మోదీకి విషెస్ తెలియజేశారు. 

"వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు" అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించడం తెలిసిందే. మోదీతో పాటు మంత్రివర్గ  సభ్యులు కూడా నేడు ప్రమాణం చేశారు.

Narendra Modi
Jagan
Prime Minister
Andhra Pradesh

More Telugu News