వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలి: చంద్రబాబు

  • ఏపీలో పరిస్థితులపై చంద్రబాబు ఆరా
  • కొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు
  • టీడీపీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.

వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ సహనంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. 

వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలని అన్నారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Chandrababu
TDP Mahanadu
YSRCP
Andhra Pradesh

More Telugu News