ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు

  • నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరంలేదని సజ్జల వ్యాఖ్యానించారంటూ వార్తలు  
  • సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమ, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు
  • సజ్జలపై తాడేపల్లి పోలీసుల కేసు
కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన కామెంట్స్ పై టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Sajjala Ramakrishna Reddy
Case filed
Polling Agents
YSRCP

More Telugu News