ఎన్నికల కోడ్ లేకపోతే కేసులు పెట్టేవాళ్లం: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana on land title act
  • వివాదాస్పదమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్
  • యాక్ట్ ను వ్యతిరేకిస్తున్న విపక్షాలు
  • యాక్ట్ ను తెచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటున్న వైసీపీ నేతలు
ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను విమర్శిస్తున్న వారిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్ట్ ను తాము తీసుకురాలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఏదైనా అడగాలనుకుంటే తమను కాకుండా, బీజేపీని అడగాలని సూచించారు.

మరోవైపు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... భూహక్కుదారులకు ప్రయోజనం కలిగేలా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. దళారి వ్యవస్థ ఉండకూడదని ఈ యాక్ట్ తెస్తున్నామని అన్నారు. ఈ చట్టంపై ఎవరికీ అనుమానాలు వద్దని... జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ లేకపోతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కేసులు పెట్టేవారమని చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను చట్టం చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సలహాలు, సూచనలు చేసిందని తెలిపారు.
Go Back to Shorts
Botsa
YSRCP
Land title act

More Telugu News