ఏపీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లపై సీఈవో సమీక్ష

  • ఏపీలో ఎన్నికలకు దగ్గరపడుతున్న సమయం
  • జిల్లాల ఎన్నికల అధికారులతో ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష
  • పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులపై కూడా చర్చ
ఏపీలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల సమయంలో జరిగే అక్రమాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 


AP Elections
CEO

More Telugu News