వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు పంపిన స్పీకర్

  • రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల దాఖలు
  • ఫిబ్రవరి 8న విచారణకు గైర్హాజరైన వైసీపీ రెబెల్స్
  • తాజాగా ఈ నెల 12న మరోసారి విచారణ
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు మరోసారి నోటీసులు పంపారు. బహిష్కృత ఎమ్మెల్యేలకు ఇదివరకే పలుమార్లు నోటీసులు పంపారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, స్పీకర్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలవగా, వైసీపీ రెబెల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

AP Assembly Speaker
Notice
YSRCP Rebel MLAs
Andhra Pradesh

More Telugu News