ఈ నెల 18 నుంచి 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల జారీ

  • సోమవారం సీఎం అధ్యక్షతన వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశం
  • ఈ నెల 18 నుంచి కొత్త కార్డుల పంపిణీ చేపడతామన్న అధికారులు
  • కార్డుల ముద్రణ కొనసాగుతోందని వెల్లడి
  • జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పురోగతిని సీఎంకు వివరించిన వైనం
ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం సీఎం జగన్ అద్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ఆరోగ్యశ్రీ కార్డులు పెద్దమొత్తంలో ఉన్నట్టు తెలిపారు. ఫలితంగా, కార్డుల ముద్రణ కొనసాగుతోందన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారంతో ఇదివరకే బ్రోచర్లు సిద్ధం చేశామని తెలిపారు. అంతేకాకుండా, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు.

Aarogyasri health cards
Andhra Pradesh
YS Jagan
YSRCP

More Telugu News