ఆర్మూర్‌లో బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఘన విజయం

BJPs Rakesh Reddy wins from Armoor
  • సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డిపై రాకేశ్ గెలుపు
  • మూడో స్థానానికి పడిపోయిన ఆశన్నగారి జీవన్ రెడ్డి
  • ఇప్పటి వరకు 22 సీట్లలో కాంగ్రెస్, 9 సీట్లలో బీఆర్ఎస్, 5 సీట్లలో బీజేపీ విజయం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్‌పై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థికి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

ఇక రాష్ట్రవ్యాప్త ఫలితాలు చూస్తే... మధ్యాహ్నం గం.2.30 వరకు కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచి, 41 సీట్లలో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 9 సీట్లలో గెలుపొంది 31 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 5 సీట్లు గెలిచి 3 సీట్లలో ముందంజలో ఉంది.
Go Back to Shorts
rakesh reddy
BJP
Telangana Assembly Election
Telangana Assembly Results

More Telugu News