సచివాలయం కూల్చివేత... కేసీఆర్‌పై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంధవిశ్వాసాలు ఎక్కువ అని విమర్శలు
  • ముఢవిశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని మండిపాటు
  • ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్న
సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంధవిశ్వాసాలు ఎక్కువ అని దుయ్యబట్టారు. మూఢ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. అవినీతి చేసిన వారిని వదిలేది లేదని, బీఆర్ఎస్‌లోని అవినీతిపరులను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు.

Narendra Modi
BJP
Telangana Assembly Election
KCR

More Telugu News