పులివెందులలో శ్రీకృష్ణ ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan inaugurates Sri Krishna temple in Pulivenduala
  • ఇవాళ రాయలసీమలో సీఎం జగన్ పర్యటన
  • అన్నమయ్య జిల్లాలో పలు వివాహ కార్యక్రమాలకు హాజరు
  • అనంతరం కడప జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటన
  • వివిధ ప్రారంభోత్సవాలకు హాజరు
ఏపీ సీఎం జగన్ ఇవాళ రాయలసీమ పర్యటనకు వచ్చారు. అన్నమయ్య జిల్లాలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం, ఆ తర్వాత కడప జిల్లాలో అడుగుపెట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.

పులివెందులలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన శిల్పారామాన్ని ప్రారంభించిన అనంతరం, శ్రీస్వామి నారాయణ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ పాఠశాలకు ఏపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమి కేటాయించగా... స్వామి నారాయణ్ సంస్థ రూ.60 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపడుతోంది. 

ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ఏపీ కార్ల్ వద్ద అగ్రికల్చర్, హార్టీకల్చర్ ల్యాబ్ ను ప్రారంభించారు. అంతేకాదు, పులివెందులలోని ఆదిత్య బిర్లా టెక్స్ టైల్ యూనిట్ ను కూడా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Go Back to Shorts
CM Jagan
Sri Krishna Temple
Pulivendula
YSRCP
Andhra Pradesh

More Telugu News