కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడు: పొంగులేటి

  • ఇందిరమ్మ రాజ్యం కోసం చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలన్న పొంగులేటి
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి
  • దోచుకున్న వందల కోట్ల డబ్బుతో ఓడించాలని చూస్తున్నారని ఆరోపణ
తెలంగాణలో దొరల పాలన కావాలా? ప్రజల పాలన కావాలా? అన్నది ఆలోచించాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, డబ్బుతో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారన్నారు. ఆయన కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ రాజ్యం కోసం చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని, రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, భూమిలేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం రూ.12 వేలు ఇస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కలలు కన్నారని, కానీ వారి కలలను బీఆర్ఎస్ కల్లలు చేసిందన్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. దోచుకున్న డబ్బుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమను ఓడించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.

Ponguleti Srinivas Reddy
KCR
Telangana
Telangana Assembly Election

More Telugu News