ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా: పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు

  • టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావంటూ విజయసాయి విమర్శలు
  • ఢిల్లీ పెద్దలకు కూడా ఈ విషయం తెలుసని వ్యాఖ్య
  • గాలి బుడగలా ఎగురుతున్నావని విమర్శ
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. 'సంస్థాగతంగా బీజేపీని (అంటే తమరున్న పార్టీని) ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురందేశ్వరి. ఇసుకను గతంలో దోచుకునేవారు. ఇప్పుడు సహజవనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోందని తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!' అని ట్వీట్ చేశారు.


Vijayasai Reddy
YSRCP
Daggubati Purandeswari
BJP
Telugudesam

More Telugu News