చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ఏం అడిగారంటే!?

What ACB judge asked chandrababu
  • సీఐడీ విచారణ సందర్భంగా వైద్య పరీక్షల నిర్వహణపై జడ్జి ఆరా
  • రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామన్న న్యాయమూర్తి
మీ బెయిల్ పిటిషన్‌ను రేపు సోమవారం విచారిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏసీబీ న్యాయమూర్తి చెప్పారని తెలుస్తోంది. ఈ రోజు కస్టడీ, రిమాండ్ ముగిసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు... చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రెండురోజుల కస్టడీ ముగియడంతో విచారణ అధికారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నట్లు చెప్పారని తెలుస్తోంది.

విచారణ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించారని, తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. 

ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ... రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామన్నారు. విచారణ సందర్భంగా ఏం గుర్తించారో బయట పెట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ... వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మీ న్యాయవాది నుంచి తీసుకోవాలని జడ్జి సూచించారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
acb
cid

More Telugu News