ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి జిల్లాల పర్యటన ఖరారు

Purandeswari districts tour confirmed
  • ఇటీవల ఏపీ బీజేపీ పగ్గాలందుకున్న పురందేశ్వరి
  • రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి
  • వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణుల సమాయత్తం
ఇటీవలే ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అందుకే విస్తృతస్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పురందేశ్వరి జిల్లాల పర్యటన ఖరారైంది. 

ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు. ఈ నెల 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో భేటీ అవనున్నారు. ఈ నెల 26న రాజమండ్రిలో గోదావరి జిల్లాల నేతలను కలుసుకోనున్నారు. ఈ నెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో పురందేశ్వరి సమావేశం జరపనున్నారు. 

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శ్రేణులను ఇప్పటినుంచే సమాయత్తం చేయాలని పురందేశ్వరి భావిస్తున్నారు.
Go Back to Shorts
Daggubati Purandeswari
BJP
Andhra Pradesh

More Telugu News