మంగళగిరి సీకే కన్వెన్షన్ లో టీడీపీ ఇఫ్తార్ విందు... నమాజ్ చేసిన చంద్రబాబు

Chandrababu attends Iftar at CK Convention in Mangalagiri
  • కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాసం
  • ముస్లింలకు విందు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకత్వం
  • హాజరైన చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు
  • ముస్లింలతో చంద్రబాబు సమావేశం
రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీలోని ముస్లిం నేతలు షరీఫ్, ఫరూఖ్, నాగుల్ మీరా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. 

ఇఫ్తార్ విందు నేపథ్యంలో నిర్వహించిన నమాజ్ లో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతో సమావేశమైన చంద్రబాబు... గతంలో తమ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. అయితే వైసీపీ వచ్చాక ఆ పథకాలన్నీ రద్దు చేసిందని అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అండగా నిలుస్తామని, దుల్హన్ తదితర పథకాలను మళ్లీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu
Iftar
Ramadan
Muslims
TDP
Andhra Pradesh

More Telugu News