కార్తీ చిదంబరంను చూసీచూడనట్టు వెళ్లిపోయిన రాహుల్ గాంధీ... బీజేపీ నేతల ఫైర్

  • పార్లమెంటు వద్ద ఘటన
  • సభలోకి వెళుతున్న రాహుల్
  • అదే సమయంలో ఎదురొచ్చిన కార్తీ చిదంబరం
  • మర్యాదకు కూడా పలకరించని రాహుల్!
  • రాహుల్ అహంకార వైఖరి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలోకి ఎంటరవుతున్న రాహుల్ గాంధీ... తనను పలకరించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంను పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది. ఊహించని ఆ పరిణామంతో కార్తీ చిదంబరం ఎంతో అవమానంగా ఫీలైనట్టు ఆయన హావభావాలను బట్టి తెలుస్తోంది. 

దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి పంచుకున్నారు. కార్తీ చిదంబరం పట్ల రాహుల్ గాంధీ అమర్యాదకరమైన, అహంకారపూరితమైన ప్రవర్తన చాలా బాధాకరమని విష్ణు పేర్కొన్నారు. కార్తీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని, ఆయనకు సానుభూతి తెలియజేసుకుంటున్నానని వివరించారు.

Rahul Gandhi
Karti Chidambaram
Video
Vishnu Vardhan Reddy
BJP

More Telugu News